calender_icon.png 6 October, 2024 | 6:49 AM

న్యాయమైన హక్కుల కోసం పోరాటం

05-10-2024 01:34:56 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉద్యోగుల న్యాయమైన హక్కులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యవర్గం నూతన అధ్యక్షుడిగా కే శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా సునీల్ రాజ్, అసోసియేట్ అధ్యక్షుడిగా సీసం రామాంజనేయులు, కోశాధికారిగా నామాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా మంచాల రవీందర్ ఎన్నికయ్యారు.