హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతంలో ఏర్పడిన ‘దన’ తుఫాన్ గురువారం మరింత తీవ్రంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ శుక్రవారం ఉదయం నాటికి పూరి ఐలండ్స్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 111 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో విస్తాయని పేర్కొన్నది.
దీని ప్రభావం తెలంగాణపై ఉండదని ఐఎండీ చెప్పింది. ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాళంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలో ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.