18-02-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ డేవిడ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో కలిసి పౌరసరఫరాల ఉపతహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను జిల్లాలో సమర్ధవం తంగా నిర్వహించాలని తెలిపారు. ఎవరైనా పిడిఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు, విక్రయించినట్లు గుర్తించినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.