టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత
రాజేంద్రనగర్, అక్టోబర్27: జన్వాడ ఫాంహౌస్ పార్టీలో ఎంతటి పెద్దవారున్న వదిలిపెట్టొద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత డిమాండ్ చేశారు. ఫాంహౌస్ పార్టీలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఆదివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు.
ఫాంహౌస్ పార్టీకి సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ పార్టీలో కేటీఆర్ సతీమణి శైలిమా ఉన్నారని.. పోలీసులు లేదా అధికారులు ఆమెను తప్పించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రభుత్వం నడిపిన కేటీఆర్ రాష్ట్రంలోని యువతకు.. రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు అలవాటు చేశారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని ధ్వజమెత్తారు. ఓ వైపు సీఎం డ్రగ్స్ నిర్మూళనకు చర్యలు తీసుకుంటుంటే మీరేమే డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మహిళా కాంగ్రెస్ నేతలు ఉన్నారు.