calender_icon.png 27 September, 2024 | 6:51 AM

సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

26-09-2024 06:37:29 PM

పోలీస్ కమీషనర్ శ్రీనివాస్

క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

లక్షెట్టిపేట,విజయక్రాంతి): సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం  పోలీస్ స్టేషన్ లో గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం లక్షేట్టి పేట్ రూరల్ సీఐ ఆఫీస్, లక్షేట్టిపేట పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5ఎస్ ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. నామినల్ రోల్స్ ను పరిశీలించి హెచ్ ఆర్ ఎం ఎస్ తనిఖీ చేసి హెచ్ఆర్ఎంఎస్ లో అలర్ట్ చేసిన డ్యూటీల ప్రకారం నామినల్ రోల్లో ఉండాలన్నారు.  పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... విధినిర్వహణలో అధికారులు, సిబ్బంది  పోటీపడి విధులు నిర్వహించాలని అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు, అవార్డులు ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.  ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్, సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని బైండోవర్ చేయాలని రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.

ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిసీటిఎన్ఎస్ (క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్& సిస్టం) ద్వారా ప్రతి దరఖాస్తులను, యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని  అధికారులను ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్ష శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ఎంఎస్ గ్రీవెన్స్ సెల్ ద్వారా పంపించాలని హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో  సీపీ, డిసిపి, ఏసిపి, పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో  మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షేట్టిపేట సీఐ ఎ. నరేందర్, ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.