calender_icon.png 23 October, 2024 | 4:55 PM

చిటికెలో ఒత్తిడి మాయం

01-10-2024 12:00:00 AM

రోజువారీ జీవితంలో ఒత్తిడి సహజం. కానీ అదే పనిగా ఒత్తిడి వేధిస్తే.. తలనొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణాల చేత రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఏవైనా జబ్బులుంటే తీవ్రమవుతాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది.

గాఢంగా శ్వాస తీసుకోవటం ఒకటి. దీన్ని నిమిషం పాటు చేసినా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. ఇలా చేస్తే దీర్ఘకాలం ఒత్తిడి బారినపడకుండా నివారించుకోవచ్చు. ముందుగా ప్రశాంతంగా కూచొని  ఒక అరచేతిని ఛాతీ మీద.. మరొక అరచేతిని కడుపు మీద పెట్టుకోవాలి. ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. 

ఆ తర్వాత నెమ్మదిగా ముక్కుతో శ్వాసను వదిలేయాలి. ఇలా ఒక నిమిషం సేపు చేసినా మంచి ఫలితం ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ అతిగా స్పందించడటం తగ్గతుంది. ఊపిరితిత్తులు సైతం మనం ప్రశాంతంగా ఉన్నామంటూ మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి.