16-03-2025 08:24:25 PM
కల్లూరు (విజయక్రాంతి): మేజరు గ్రామం పంచాయితీ ప్రధాన రహదారి పైన టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రభుత్వ హాస్పిటల్ వరకు గల వీధిలైట్లు లేక అగమ్య గోచారం. రోజులు గడుస్తున్న వీధి లైట్లు వేయట్లేదు అని ప్రజలు గుసగుసలు, గవర్నమెంట్ హాస్పిటల్ వైపు నుండి కల్లూరు సెంటర్ వైపు వచ్చే దారిలో వీధి లైట్లు లేక, డివైడర్ కనపడక డివైడర్ పైకి పలు వాహనాలు ఎక్కి ప్రమాదాల బారిన పడుతున్నా కూడా ఇంకా లైట్లు వేయకుండా, డివైడర్లకు సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యలని ప్రజలు కోరారు. సంబంధించినా అధికారులు స్పందించి వెంటనే వీదిలైట్లు, డివైడర్ సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలని ప్రజలు వాహన దారులు కోరుకుంటున్నారు.