calender_icon.png 25 September, 2024 | 9:59 PM

వీధి కుక్కల దాడి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

25-09-2024 04:30:43 PM

ఓ మహిళ పరిస్థితి విషమం

చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఊర కుక్కలు విజృంభిస్తున్నాయి. బుధవారం ఆరుగురు మహిళలపై కుక్కలు దాడులు చేసి గాయపరిచాయి. జిల్లా కేంద్రంలోని 45,46,47,31 వార్డుల్లో విచ్చలవిడి`గా ఊర కుక్కలు దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఏ వీధిలో చూసినా ఊర కుక్కలు దాడుల కు పాల్పడుతున్నాయి. మహిళలు, పిల్లలు వీధుల్లోకి వెళ్ళేందుకు భయపడుతున్నారు. కుక్కల దాడిలో ఆరుగురు గాయపడగా సత్యవ్వ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోని వెంటనే ఊర కుక్కలను అరికట్టాలని జిల్లా కేంద్ర వాసులు కోరుతున్నారు. లేకుంటే ఊరు కుక్కలు రెచ్చిపోయి దాడులకు పాల్పడడంతో గాయాలపాలై ప్రజలు తీవ్ర ఆ వస్తలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఊర కుక్కలను నివారించాలని కోరుతున్నారు.