calender_icon.png 19 October, 2024 | 4:44 PM

ఆర్టిఏ ఆఫీసులో నిలిచిపోయిన సేవలు

19-10-2024 02:33:46 PM

మానకొండూరు, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల రవాణా శాఖ కార్యాలయంలో సర్వర్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయి. శనివారం మండలంలో గల రవాణా శాఖ కార్యాలయానికి లైసెన్స్ ఫిట్నెస్ వాహనాల రిలీజ్ నూతన వాహనాల రిజిస్ట్రేషన్ లతోపాటు వివిధ సేవలపై కార్యాలయానికి వచ్చినవారికి ఇబ్బందులు తలుస్తున్నాయి. హైదరాబాదులోని ఎస్ టి ఏ కార్యాలయంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో కార్యాలయానికి సర్వర్ నిలిచిపోయింది. దీంతో కార్యాలయానికి వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు చెట్ల కింద కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి తమ సీమలను కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.