ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మరోసారి లాభా ల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, పైనాన్షియల్ షేర్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీ లు.. కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ఈ క్రమంలోనే సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 79,043.35 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. తర్వాత ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,561 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది. డాలరు తో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.సెన్సెక్స్లో టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్అండ్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.