సూచీలపై బడ్జెట్ ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బడ్జెట్ నేపథ్యంలో ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. రోజంతా లాభ-నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో ముగిశాయి. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయా రంగాలపై చేసిన ప్రకటన సంబంధిత కంపెనీల షేర్లపై స్పష్టంగా కనిపిం చింది.
సెన్సెక్స్ ఉదయం 77,637.01 (క్రితం ముగింపు 77,500.57) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. బడ్జెట్ నేపథ్యంలో తీవ్ర ఊగిసలాటకు లోనైంది. ఇంట్రాడేలో 77,006.47 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 5 పాయింట్ల లాభంతో 77,505.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐటీసీ హోటల్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎంఅండ్ఎం, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి.