calender_icon.png 23 October, 2024 | 2:25 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఎస్టీవో మృతి

22-07-2024 01:08:21 PM

మహబూబ్ నగర్: మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో ఓ ఉద్యోగి ఆకస్మికంగా మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రతిరోజు లాగే సోమవారం కూడా ఎస్టిఓ విధులకు హాజరయ్యారు. ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా వెనక్కి కుప్పకూలిపోయాడు. నిత్తి వెనుక భాగం గట్టిగా తాకడంతో రక్తస్రావం అయింది. ఆసుపత్రికి తీసుకుపోయి ఎస్ టి ఓ మోహన్ రాజ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరం నందు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం లో రెండు నిమిషాలు మౌనం పాటించి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.