calender_icon.png 4 February, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి మొండిచేయి..

03-02-2025 10:52:30 PM

కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ కోసం బాటలు వేస్తున్న మోడీ సర్కార్​

ఆర్​ఎస్​ఎస్​ వ్యూహాలు విద్యలో అమలుకు బీజేపీ చర్యలు

ఎస్​ఎఫ్​ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్​ 

ఎల్బీనగర్: కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి మొండిచేయి చూపించిందని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్​ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో విద్యరంగానికి మొండిచేయి చూపడంతో సోమవారం రంగారెడ్డి జిల్లా, హయత్​ నగర్​లోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్​ఎఫ్​ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి మొండిచేయి చూపించిందన్నారు. పేద వర్గాలకు విద్యను దూరం చేయాలనే సదుద్దేశంతో కార్పొరేట్, ప్రైవేటీకరణకు దగ్గర చేస్తున్న బడ్జెట్​లో కేటాయింపులున్నాయన్నారు. 

గతంతో పోలిస్తే  విద్యారంగానికి బడ్జెట్​లో  నామమాత్రంగా  0.2% మాత్రమే పెరిగింది.  రూ.12467.39 కోట్ల నుంచి రూ. 12500 మాత్రమే విద్యారంగానికి నిధులు పెరిగాయన్నారు. ఉన్నత విద్య కోసం నామమాత్రంగానే 2025-2026 బడ్జెట్ కనిపిస్తుంది. రూ.47619.77 కోట్ల నుండి రూ. 50077.95 కోట్లకు కేవలం 5% మాత్రమే పెరుగుదల చూడవచ్చు అన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఎస్ఎఫ్ఐ నాయకులు వేణు, ప్రణయ్, మహేష్, ఆశ్రిత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.