01-03-2025 07:06:42 PM
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి..
మేడ్చల్ (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనందున ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. మసీదుల వద్ద శానిటేషన్ చేయించాలని, తెల్లవారు జామున విద్యుత్తు, నీటి సరఫరా సక్రమంగా చేయాలన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.