హైదరాబాద్,(విజయక్రాంతి): దక్షిణకొరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బృందం మూడోరోజు పర్యటిస్తుంది. ఇంచియాన్ లోని చియోంగ్న, సాంగడో, యాంగ్ జోంగ్ అనే మూడు స్మార్ట్ సిటీలను రాష్ట్ర బృందం సందర్శించింది. ఈ కార్యక్రమంలో సియోల్ నగరపాలక సంస్థ డైరెక్టర్, సభ్యులతోపాటు తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, మేయర్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగించామని తెలిపారు. దక్షిణకొరియా సాంగ్డో సిటీని మొత్తాన్ని ఐవోటీతో అనుసంధానించేందుకు యత్నిస్తుంది.