calender_icon.png 9 October, 2024 | 7:46 PM

చండీయాగంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు

09-10-2024 04:57:28 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బంగారు మైసమ్మ ఆలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, జ్యోతి దంపతులు మొక్కులు తీర్చుకున్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా నిర్వహించిన చండీయాగంలో పాల్గొని పూజలు బెల్లంపల్లి సివిల్ జడ్జి జె. ముఖేష్ చండీయాగంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గెల్లి రాజలింగు, కానగంటి కుమారస్వామి, అనుముల సత్యనారాయణ, మల్రాజు శ్రీనివాస్ రావ్, పుత్తూరు శ్రీనివాస్, మెరుగు రమేష్ , భక్తులు పాల్గొన్నారు.