calender_icon.png 17 March, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

17-03-2025 01:51:00 AM

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి 

నల్లగొండ, మార్చి 16 (విజయక్రాంతి) :  పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో 34 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 9 లక్షల 45 వేల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరి రక్షణకు సీఎంఆర్‌ఎఫ్ వరంలాంటిదన్నారు. నిరుపేదలు ఆర్థిక ఇబ్బంది లేకుండా అధునాతన వైద్యసేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి దోహదం చేస్తున్నదని పేర్కొన్నారు.