సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని 12వ వార్డు ప్రజల కోరిక మేరకు వార్డు జంక్షన్ల దగ్గర ఎక్కువగా చీకటి ఉన్నందువలన వార్డు ప్రజలు పులి మామిడి రాజును సంప్రదించారు. వార్డు ప్రజల కోరిక మేరకు వెంటనే మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులనుండి ఈశ్వర్ మందిర్ బైపాస్ రోడ్డు వద్ద మరియు ఉషాకిరణ్ యూత్ జంక్షన్ వద్ద రెండు నూతన ఐమాక్స్ లైట్లను వేయించి వాటిని ఈరోజు పులిమామిడి రాజు తన చేతుల మీదుగా ప్రారంభించడానికి విచ్చేసిన పులిమామిడి రాజును మహేశ్వర్ స్వామి పంతులు వేదమంత్రాలతో స్వాగతించారు.
తదుపరి బిల్లకంటి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంత చక్కటి లైటింగ్ను ఏర్పాటు చేయించిన సందర్భంగా వార్డు ప్రజలు చాలా సంతోషాన్ని వక్తపరుస్తూ వార్డు ప్రజలందరి పక్షాన పులిమామిడి రాజుకు ధన్యవాదాలు తెలియ జేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు నీలి శ్రీనివాస్ నీలి జగన్నాథం, అంజయ్య, శ్రీనివాస్, నెల్లి కృష్ణ, బిళ్లకంటి శ్రీనివాస్ గౌడ్, నాగిషెట్టి, సిహెచ్.రవి, చీలం సురేష్, అనిల్, సతీష్, వెంకట్, శివ, ప్రతాప్ గౌడ్, బాంచ సతీష్, మాలె శ్రీను, మాణిక్యం, పరమదాసు, బాంచ లక్ష్మయ్య, నీలి వెంకటేశం మరియు ఉషాకిరణ్ యూత్ సభ్యులు మరియు పి.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, మునిపల్లి రమేష్, అఖిల్ , మనోజ్ , నరేష్ , మనోజ్ , ఫయాజ్, అజీమ్, నిస్సార్, ఇలియాస్, అజాస్, నసిర్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.