31-03-2025 10:25:57 PM
స్టార్ హీరో శర్వానంద్ తన 38 సినిమాను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కెరీర్లో ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానుంది. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్.. శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్స్టోన్ కానుంది. ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీరాధామోహన్ సమర్పిస్తున్నారు.
1960ల చివరలో ఉత్తర తెలంగాణ- మహరాష్ట్ర సరిహద్దులో జరిగే కథతో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శర్వా పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టడానికి, టీమ్ బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్ల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంది. శర్వా మేకోవర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో శర్వా 1960ల కాలపు వ్యక్తిగా కనిపించనున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో సినిమా విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: సౌందర్ రాజన్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె; నిర్మాత: కేకే రాధామోహన్; రచనాదర్శకత్వం: సంపత్ నంది.