calender_icon.png 18 October, 2024 | 9:55 PM

యాంపిన్ ఎనర్జీకి స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు రుణం

18-10-2024 01:03:07 AM

ముంబై : ‘యాంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్’, తన 200ఎంవీపీ హైబ్రి డ్ ప్రాజెక్ట్ కోసం స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు నుంచి రూ.742 కోట్ల రుణా న్ని పొందినట్లు గురువారం ప్రకటించింది. ఈ సౌర-పవన ప్రాజెక్ట్ రాజస్థా న్‌లో రానుంది.

ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ రూ.944 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లో వార్షిక ప్రాతిపదికన 43.50 కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును 74,486 నివాసాలకు సరఫరా చేయవచ్చని కంపెనీ పేర్కొంది.