25-02-2025 06:17:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏ కృష్ణవేణి మహిళా ఓటర్లను కోరారు. నిర్మల్ మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం పట్టభద్రుని కలిసి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారాయణ కార్యకర్తలు ఉన్నారు.