calender_icon.png 24 October, 2024 | 8:46 AM

యూపీలో తొక్కొసలాట... 27 మంది మృతి

02-07-2024 05:42:05 PM

రతిభాన్యూర్ : ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్యూర్ లో జరిగిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా దవాఖానకు తరలించారు. మృతుల్లో 23 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.