calender_icon.png 14 October, 2024 | 2:14 AM

యువకులపై కత్తిపోట్లు

14-10-2024 12:22:37 AM

నిజామాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలో ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో శనివారం రేహాన్, జావిద్, బబ్లూ రోడ్డు పక్కన ఉండి మాట్లాడుకుంటున్నారు. అటు నుంచి వెళ్లి న మన్సూర్ అనే యువకుడు ఆ ముగ్గురి తన గురించే మాట్లాడుతున్నారని భావించి తన సోదరులు అన్వర్, బాసిత్‌లతో కలిసి కత్తితో దాడిచేసి ముగ్గురిని గాయపరిచారు. గాయపడిన యువకులను బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మన్సూర్, అతని సోదరులపై బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.