18-02-2025 12:37:32 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదు వుకొని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం బి హెచ్ ఈ ఎల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనికీ చేశారు . పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహనా కల్పించారు. మీరు పది సంవత్సరాల తరువాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో , ఆ ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసేసుకోవాలని అన్నారు. జీవితంలో ని లదొక్కుకొనేందుకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అన్నారు .
ప్రణాళిక బద్దంగా చదవి ఉత్తమ ఫలితాలు సాదించాలని సూచించారు . విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదల తో బాగా చదివి ఉన్నత స్థానాలలో నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. కష్టపడుతూ ,ఇష్టపడి చదువుకోవాలని అన్నారు . విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ పదవ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. తరగతి గది లో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పదిలో, పదికి పది పాయింట్లు సాధించాలని అన్నారు.
పాఠశాల వంటగదిలను, మధ్యాహ్న భోజనం నాణ్యతను పారిశీలించారు . పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కంప్యూటర్ ల్యాబ్ , సైన్స్ ల్యాబ్ లను పరిశీలించారు . పాఠశాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుక ఉన్న విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆదేశించారు . కలెక్టర్ వెంట డి ఈ ఓ వెంకటేశ్వర్లులు ,తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి , ఏం ఈ , ఓ పి పి రాథోడ్ ఉపాధ్యా యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.