calender_icon.png 9 October, 2024 | 6:55 PM

పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడిగా శ్రీపాల్ రెడ్డి

09-10-2024 02:23:33 AM

సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో సోమ, మంగళవారాల్లో జరిగిన పీఆర్టీయూ టీఎస్ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూనత కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పింగలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుల్గం దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టులకు నాలుగు నామినేషన్లు వచ్చినప్పటికీ చివరకు వీరినే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీపాల్ రెడ్డి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను దసరా కానుకగా విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని కోరారు. 

ఉద్యమ కార్యాచరణ..

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, జీపీఎఫ్, టీఎస్ జీఎల్‌ఐ, మెడికల్, ఉద్యో గ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు మొత్తం దసరా పండుగలోపు చెల్లించాలని, లే నిపక్షంలో పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచర ణ చేపడతామని ఎమ్మెల్సీ కూర ర ఘోత్తం రెడ్డి తెలిపారు.