calender_icon.png 29 May, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శ్రీనుబాబు

20-04-2025 04:32:29 PM

కమాన్ పూర్ (విజయక్రాంతి): నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండి, సకల శుభాలు కలగాలని, మండలంలోని  నాగారం గ్రామములో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆదివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. పోచమ్మ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సకల శుభాలు కలగాలని, నియోజకవర్గ ప్రజలందరూ  ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని శ్రీను బాబు కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.