అలంపూర్, సెప్టెంబర్ 29: గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎర్రవల్లికి చెందిన నీలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలి శ్రీనివాసులు గతంలో ఎర్రవల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.