calender_icon.png 30 September, 2024 | 2:55 PM

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా శ్రీనివాసులు

30-09-2024 01:18:45 AM

అలంపూర్, సెప్టెంబర్ 29: గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎర్రవల్లికి చెందిన నీలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలి శ్రీనివాసులు గతంలో ఎర్రవల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.