గాలె: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. కివీస్ మరో 580 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ను 602/5 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ (106*) సెంచరీతో కదం తొక్కాడు.
కమిందు మెండిస్ (182*), చండిమల్ (116) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన లంక భారీ స్కోరు చేసింది. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆసియా క్రికెటర్గా కమిందు మెండిస్ (13 ఇన్నింగ్స్లు) కొత్త రికార్డు నెలకొల్పాడు.