నిర్మాత బన్నీ వాసు
హైదరాబాద్సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిస లాటలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్కు మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని బన్నీ వాసు తెలిపారు. ఆదివారం శ్రీతేజ్ను పరా మర్శించి.. అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కు ముక్కులో అమర్చిన పైపు ద్వారానే ఇప్పటికీ అతనికి ఆహారాన్ని అందిస్తున్నారు.