16-04-2025 10:04:09 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో శ్రవణ్రావు నేడు మరోసారి విచారణ వెళ్లనున్నారు. ఇప్పటికే శ్రవణ్రావు(Sravan Rao)ను దర్యాప్తు బృందం మూడు సార్లు విచారించింది. మరోసారి విచారణకు రావాలని శ్రవణ్రావుకు నోటీసులు పంపించారు. శ్రవణ్ సెల్ ఫోన్ లోని సమాచారాన్ని పోలీసులు(Police) రీట్రీవ్ చేస్తున్నారు. శ్రవణ్రావు విచారణకు సహకరించకుంటే పోలీసులు సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లే అవకాశముంది. శ్రవణ్రావుపై ఉన్న (నాట్ టు అరెస్టు రిలీఫ్)ను కొట్టివేయాలని కోరే అవకాశముంది. శ్రవణ్ రావు నోరు విప్పితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.