02-03-2025 06:56:34 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ ఉద్యోగులకు జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటిలలో గెలుపొందిన విజేతలకు మార్చి 8న సిఇఆర్ క్లబ్ లో నిర్వహించబడే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో సేవా అధ్యక్షురాలు వి.రమ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, సేవాసమితి, కమ్యూనికేషన్ కో అర్దినేర్ లు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.