29-03-2025 12:41:00 AM
కొత్తగూడెం క్లబ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
భద్రాద్రి,(విజయక్రాంతి): కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివ రావు, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్బులో కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండేలా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ప్రత్యేక నమాజు అనంతరం ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతాభావం పెంచుతున్నాయని అన్నారు. ప్రభుత్వం పండుగల సమయాల్లో అధికారిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పవిత్ర రంజాన్ మాసం సమాజంలో శాంతిని నెలకొల్పుతుందని, ప్రజల, కులాలు, మతాల మధ్య ద్వేషాలను దూరం చేస్తుందన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటి చెబుతోందన్నారు. నియోజకవర్గ అభివృధ్ధికోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులకు తాను చేస్తున్న కృషికి ప్రజలు, అధికారులు సహకరించి మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్, మత గురువులు మహమ్మద్ మునావర్ హుస్సేన్, అబ్దుల్ అజిజ్ మంజార్, మత పెద్దలు జహంగీర్ షరీఫ్, రబ్ సాబ్, అబీద్ హుస్సేన్, జావీద్ సాటే, బాసిత్ భాయ్, ఖాద్రి, యాకుబ్, సిపిఐ నాయకులు దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళి, తూము చౌదరి, నాగా సీతారాములు, పల్లపోతు సాయి, మాజీ కౌన్సిలర్స్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.