calender_icon.png 10 March, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

10-03-2025 01:09:35 AM

నల్లగొండ, మార్చి 9 (విజయక్రాంతి) :  ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులున్నారు.