న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎయిర్లైనర్ స్పైస్ జెట్కు ఊరట లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీద్వారా రూ. 3,000 కోట్ల నిధుల్ని సమీకరించగలిగింది. పలు న్యాయపోరాటా లు, ఆర్థిక సవాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విమానయాన సంస్థ వివిధ అవసరాల్ని తీర్చేందుకు నిధులు సమీకరణ ప్రతిపాదనకు వారం రోజుల క్రితమే స్పైస్జెట్ షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. 2019లో 74 విమానాలు కలిగిన స్పైస్ జెట్ ప్రస్తుతం 20 ఎయిర్క్రాఫ్ట్లను మాత్రమే నడుపుతున్నది. షేరుకు రూ.61.60 ధర చొప్పున 48.70 కోట్ల షేర్లను ఈ క్విప్ ఇష్యూ లో జారీచేసింది.