14-03-2025 12:37:50 AM
అధికారులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు
కుత్బుల్లాపూర్, మార్చ్ 13(విజయక్రాంతి):ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియపై వార్డు ఆఫీసర్స్ తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్ ఆర్ ఎస్ సమస్యల పై ఆరా తీసిన కలెక్టర్ అనధికారిక లే ఔట్ లలో ని ప్లాట్స్ ను సరైన రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రజలకు వార్డు ఆఫీసర్స్ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు దారులు ఈ నెల 31 లోగా తమ ప్లాట్స్ క్రమబద్దీకరణ రుసుము చెల్లిస్తే ప్రభుత్వం నుండి 25 శాతం రాయితీ వస్తుందని కలెక్టర్ తెలిపారు.
అలాగే నిజాంపేట్ మున్సిపల్ లో ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.బాచుపల్లి మండలం లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకి గురి కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, నిజాంపేట్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు