calender_icon.png 24 October, 2024 | 5:48 PM

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

12-08-2024 11:02:51 AM

కొనసాగిన భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు పూజలు కొనసాగించారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలు రద్దు పరచి శీఘ్ర దర్శనం అమలు చేశారు. కొడేమొక్కులు, కుంకుమపూజల మొక్కులు చెల్లించుకున్నారు.