28-02-2025 12:41:34 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానం వద్ద గురువారం అమవాస్య సందర్భంగా భక్తులు కాల భైరవ స్వామికి , అరుణాచల శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శునకాలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు దేవార వినోద్ స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.