మంథని: మంథనిలో మత్తుపదార్థాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని మంథని సీఐ రాజుగౌడ్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో సీఐ రాజు గౌడ్ మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని, పోలీశాఖ ఆధ్వర్యంలో త్వరలో యువతకు కౌన్సెలింగ్ చేస్తామని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకి సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.