calender_icon.png 9 October, 2024 | 8:50 AM

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

09-10-2024 01:23:46 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబ ర్ 8 (విజయక్రాంతి): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. మంగ ళవారం ఆమె చార్మినార్ జోన్‌లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్‌ఆలంట్యాంక్, బహదూర్ పుర తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆటోల కద లికలపై దృష్టి సారించాలని, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేలా పర్య వేక్షించాలని సూచించారు. కమర్షియల్ స్ట్రెచెస్‌లో వ్యర్థాలు వెంటనే తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిష నర్ రవికుమార్‌ను ఆదేశించారు.