16-02-2025 12:34:23 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆనకట్టల సమర్థవంతమైన నిర్వహణ, నదుల అనుసంధానం, భూగర్భజల భద్రత విధానాలతో భవిష్యత్తులో నీటి భద్రతను పెంచ డం కీలకమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు మైక్రో-ఇరిగేషన్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయ న అధికారులకు సూచించారు. ఈ నెల 18, 19 తేదీలలో రాజస్థాన్ అఖిల భారత నీటిపారుదల మంత్రుల సదస్సు జరగనున్నట్లు, అందుకు అధికారులు సమగ్ర నివేదికలను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు, వివిధ ఎత్తిపోతల పథకాల పురోగతి తో పాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై శనివారం హైదరాబాద్ జలసౌధలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాజస్థాన్లో జరగనున్న జాతీయ స్థాయి సద స్సులో రాష్ర్టం నీటిపారుదల రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్తో పాటు ఆధునిక నీటి నిర్వహణపై అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ అమలు తీరుపై జాతీయ స్థాయిలో గణాంకాలతో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవస రమైన సమాచారాన్ని సేకరించలన్నారు.
కేం ద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్లో నిర్వహించనున్న జాతీయ సదస్సులో రాష్ట్రాల నీటి పారుదల మంత్రు లను, కేంద్ర ప్రభుత్వ విధానకర్తలను, నీటి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానుందన్నారు. ఈ సదస్సులో నీటి నిల్వలను మెరు గుపరచడం, నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచడం వంటి ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి కేంద్ర సహా యం, నిధుల పెంపుదలకు, రాష్ర్ట నీటి పారుదల ప్రాజెక్టులకు మరింత సహకారం పొం దేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో గరిష్ట ఆయకట్టును విస్తరించడంపై కట్టుబడి ఉం దని మంత్రి స్పష్టం చేశారు.
తక్కువ పెట్టుబడితో అధిక నీటి పారుదల ప్రయోజనాలను అందించగల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం అధిక ఖర్చు చేసినా పరిమిత ఫలితాలనే సాధించిందని ఆయన గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని వివరించారు.
ఎస్ఎల్బీసీ (శీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ), డిండీ, పాలమూరు -రంగారెడ్డి, దేవాదుల, ఇంకా పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ను వేగంగా పూర్తి చేసేందుకు గడువు విధించి రైతులకు సాగునీరు అందించేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు. అదే విధంగా, నీటి పారుదల పనుల పర్యవేక్షణను మరింత మెరుగుపరచి, పారదర్శకత, సమర్థత పెంచాల్సిన అవసరం ఉందని, పనుల ఆల స్యం లేదా నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ర్టం చేపడుతున్న పూడిక తీత పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇతర రాష్ట్రాలకు రాష్ర్ట ప్రభుత్వం ఆదర్శంగా నిలిచే విధంగా వాటిని వివరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ ప్రద ర్శనను గణాం కాలతో, దృశ్యరూపాలతో, కేస్ స్టడీలతో చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్, ఈఎన్సీ అనిల్కుమా ర్, సీఈలు కే శ్రీనివాస్, అజయ్ కుమార్, రమేష్ బాబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.