జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
రాజేంద్రనగర్, అక్టోబబర్ 18: పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్కు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా పర్యటించారు. ఆరంఘర్ చౌరస్తా లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అప్రమ త్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ జీహెచ్ఎంసీ నూతన కమిషనర్కు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.