calender_icon.png 15 October, 2024 | 8:58 AM

ఖాజీపేట దర్గాకు స్పీకర్ చాదర్ సమర్పణ

03-09-2024 01:09:21 AM

ఖాజీపేటలోని సయ్యద్ షా అప్జల్ బిఅబాని దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవంలో సోమవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అప్జల్ బిఅబాని ఖుస్రో పాషా స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ దర్గాకు చాదర్, గంధం సమర్పించి  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్పీకర్‌ను దర్గా కమిటీ శాలువాతో సన్మానించింది.