calender_icon.png 23 October, 2024 | 10:57 AM

కోల్ కతా ఘటనతో రిమ్స్ భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి

29-08-2024 01:37:55 PM

మెడికోల హాస్టల్, సీసీ కెమెరాల నిర్వాణ తీరుపైపరిశీలన...

ఆదిలాబాద్, (విజయ క్రాంతి) :  ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) ఆస్పత్రి భద్రతపై జిల్లా ఎస్పీ గౌష్ అలం ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కోల్ కతా లో వైద్య విద్యార్థిని పై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని గురువారం రిమ్స్ ఆస్పత్రి ని సందర్శించారు. రిమ్స్ లో భద్రతలో భాగంగా సిసి కెమెరాలతో పాటు ప్రతి విభాగాన్ని ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. రిమ్స్ లోని ప్రతి సీసీ కెమెరా పని చేస్తుందా లేదా అనే అంశంపై స్వయంగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో కలిసి పలు విభాగాలను తనిఖీ చేశారు. సెక్యూరిటీ గార్డు సెంటర్ లోని రిజిస్టర్ ను పరిశీలించారు. అదేవిధంగా  వైద్య విద్యార్థిని, విద్యార్థులు నివసించే హాస్టల్ గదులను, పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. సెక్యూరిటీ గార్డులతో మాట్లాడి భద్రత తీరుపై ఆరా తీశారు. సెక్యూరిటీ గార్డ్, సూపర్వైజర్ లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.