calender_icon.png 17 March, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

17-03-2025 04:35:46 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను సోమవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన రికార్డులను పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్ మండలంలోని గ్రామాలు జనాభా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంత వివరాలు, క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా వీధుల్లోకి చేరిన పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.... నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు ఏ విధంగా విధులు నిర్వహించాలి. వారికి సూచించారు. ఆయన వెంట డిఎస్పి సత్యనారాయణ, సిఐ రాజేష్, ఎస్ఐ శివకుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.