calender_icon.png 9 October, 2024 | 6:56 PM

ఎస్పి పనితీరు ప్రశంసనీయం..

09-10-2024 04:17:04 PM

అధికారులు మరియు సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయాలి

రాచకొండ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి విధి నిర్వహణ సులభతరమయ్యేలా

టాబ్లెట్లు, డెస్క్ టాప్ కంప్యూటర్ల వంటి సాంకేతిక పరికరాలు అందజేసిన కమీషనర్.

రాచకొండ: సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు రాచకొండ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మరియు సిబ్బందితో నేరేడ్మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ గారు మాట్లాడుతూ.. రాచకొండ స్పెషల్ బ్రాంచ్ విభాగం అద్భుతంగా పని చేస్తోందని, వివిధ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందికి మరియు వివిధ పోలీస్ విభాగాలకు అవసరమైన తోడ్పాటు అందిస్తూ నేరశాతం తగ్గింపునకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ వంటి అనుమతుల జారీలో సమర్థవంతంగా మరియు వేగవంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.

స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వారికి విధి నిర్వహణ మరింత సులభతరం అయ్యేందుకు అవసరమైన సాంకేతిక తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ బ్రాంచ్ జోన్ల అధికారులు మరియు వివిధ విభాగాల సిబ్బందికి ట్యాబ్లెట్లు, లాప్ టాప్ లు, ప్రింటర్లు, స్కానర్లు, హార్డ్ డిస్కుల వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందజేశారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు మరియు సిబ్బంది ఇక మీదట మరింత సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి ఎస్బి కరుణాకర్, ఏసీపి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు అశోక్, మన్మోహన్, స్వామి, వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.