27-02-2025 11:41:55 PM
మణుగూరు,(జయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన కూరపాటి సౌజన్య రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పీసీసీ మహిళా విభాగం అధ్యక్షరాలు సునీతా రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నలు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలఫై మహిళా కాంగ్రెస్ పక్షాన చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయటంలోను, మండలంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి సౌజన్య కీలక పాత్ర పోషించారు.
ఆమె సేవలను గుర్తించిన మహిళా కాంగ్రెస్ నాయకత్వం తిరిగి రెండోసారి ఆమెకు మండల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సౌజన్య పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ బలోపేతంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో కీలకమైన మండల మహిళా కాంగ్రెస్ బాధ్యతలను రెండోవ సారి అప్పగించిన మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్నలకు కృతజ్ఞతలు తెలిపారు. సౌజన్య రెండోసారి ఎన్నిక కావడం పట్ల మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.