calender_icon.png 25 October, 2024 | 10:59 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో సదరన్ ట్రావెల్స్

25-10-2024 12:12:07 AM

నూతన శాఖను ప్రారంభించిన యాజమాన్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : దేశంలోని ప్రముఖ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ సదరన్ ట్రావెల్స్ నూతన శాఖను హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం ప్రారంభించింది. నల్లగొండ ఎంపీ కందూరు రఘువీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన శాఖను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా అసమానమైన సేవలను అందిస్తున్న తమ సంస్థ దిల్‌సుఖ్‌నగర్‌లో శాఖ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ శాఖ ద్వారా మరింత మంది ప్రయాణికులకు రవాణాసేవలు అందిస్తుందని ఆశిం చారు.

కాగా.. సదరన్ ట్రావెల్స్ మొదటగా 1970లో దివంగత ఆలపాటి వెంకటేశ్వరరావుచే న్యూఢిల్లీలో స్థాపించబడిందని.. గత 54 సంవత్సరాల్లో 99శాతం కస్టమర్ రేటుతో 4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సేవలు అందించిందని అన్నారు. 2వేల కంటే పైన దేశీయ, అంతర్జాతీయ స్థిరమైన హాలీడే ప్యాకేజీలను సదరన్ ట్రావెల్స్ అందిస్తోందని ఆయన తెలిపారు.

ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ సేవలను అందించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలవ్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ జి.పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.