calender_icon.png 10 October, 2024 | 8:52 PM

కెప్టెన్సీకి సౌథీ గుడ్ బై

03-10-2024 12:00:00 AM

ఆక్లాండ్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్లో పెను దుమారం రేగింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న టిమ్ సౌథీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. సౌథీ స్థానంలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పుతూ కివీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీలంక చేతిలో 2-0 తేడాతో వైట్ వాష్‌కు గురి కావడంతో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సౌథీ కెప్టెన్సీలో కివీస్ 14 టెస్టులు ఆడగా.. అందులో ఆరింట గెలిచి మరో ఆరింట ఓడిపోయింది. మిగిలిన రెండు టెస్టుల ను డ్రాగా ముగించుకుంది. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టామ్ లాథమ్‌కు సౌథీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు. తనకు ఇన్ని రోజులు సహకరించిన ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు.