హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో గురువారం జీఎం అరుణ్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీలతో భేటీ కాన్నారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వేలైన్ సమస్యలను, ఆర్వోబీలు, అండర్ పాసుల సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొనున్నారు.