calender_icon.png 16 October, 2024 | 5:56 PM

నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసుల దాడి..

16-10-2024 03:02:04 PM

ప్రధాన నిందితుడు అరెస్ట్, భారీగా ముడి సరుకు స్వాధీనం

మేడిపల్లి, (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పీర్జాదిగూడలో నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసుల దాడిచేసి నిందితుడు గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్(51) ను అరెస్ట్ చేసారు. 300కేజీల పనీర్, 4500లీటర్ల రిపైండ్ ఫామాయిల్, 750లీటర్ల అసిటిక్ యాసిడ్, 16250కేజీల స్కీమ్డ్ మిల్క్ పౌడర్, 15లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్, భారీగా ఇతర ముడి సరుకులు స్వాదీనం. సికింద్రాబాద్ బోయిగూడకి చెందిన గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్, పీర్జాదిగూడ అడ్డాగా కోహినూరు పాల ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్వహిస్తూ, నకిలీ ఉత్పత్తులు చేపడుతున్నాడు. పక్క సమాచారంతో దాడి చేసిన ఎస్ఓటి పోలీసులు, నిందితుడు గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ అదుపులోకి తీసుకొని, స్వాదీనం చేసుకున్న పాల ఉత్పత్తులను, ముడి సరుకులను మేడిపల్లి పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.